హైదరాబాద్, ఫిబ్రవరి 18-2026:తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “4th Telangana State Police Sports & Games Meet–2026” శుక్రవారం సైబరాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. రాష్ట్ర డీజీపీ B. Shivdhar Reddy ముఖ్య అతిథిగా విచ్చేసి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ Dr. M. Ramesh అందించిన క్రీడా జ్యోతిని డీజీపీ వెలిగించి పోటీలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా క్రీడాకారులు, అధికారులు కలిసి అందెశ్రీ రచించిన “జయ జయహే తెలంగాణ” గీతాన్ని ఆలపించగా మైదానం దేశభక్తి నినాదాలతో మారుమోగింది. గన్ ఫైర్, బెలూన్ల విడుదలతో పోటీలు అధికారికంగా ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా DGP B. Shivdhar Reddy మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్, అంతర్జాతీయ ఫుట్బాల్ మ్యాచ్లు, ఎన్నికల బందోబస్తు, సమ్మక్క–సారక్క జాతర వంటి కీలక బాధ్యతలను పోలీసులు నిబద్ధతతో నిర్వర్తించారని అభినందించారు. శాంతిభద్రతల మధ్య బిజీగా ఉన్నప్పటికీ క్రీడల్లో పాల్గొనడం సిబ్బందిలో ఉత్సాహాన్ని పెంచుతుందని తెలిపారు. క్రీడలు నాయకత్వ లక్షణాలు, టీమ్ స్పిరిట్, మానసిక ధైర్యాన్ని పెంపొందిస్తాయని చెప్పారు. గెలుపోటములకంటే క్రీడాస్ఫూర్తి ముఖ్యమని, మహిళా పోలీసుల ప్రాతినిధ్యం అన్ని విభాగాల్లో పెరగాలని సూచించారు.
Cyberabad CP Dr. M. Ramesh మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల నుండి 2,532 మంది క్రీడాకారులు పాల్గొనడం గర్వకారణమని, వీరిలో 300 మంది మహిళా క్రీడాకారులు ఉన్నారని తెలిపారు. మొత్తం 31 క్రీడా విభాగాల్లో పోటీలు జరుగుతుండగా మహిళలకు 14 ఈవెంట్లు కేటాయించినట్లు చెప్పారు. జాతీయ స్థాయి విజేతలకు గోల్డ్ మెడల్కు రూ.3 లక్షలు, సిల్వర్కు రూ.2 లక్షలు, బ్రాంజ్కు రూ.1 లక్ష నగదు బహుమతులతో పాటు ఇంక్రిమెంట్లు అందజేస్తామని వెల్లడించారు. త్వరలో జరగనున్న All India Police Football Championshipకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనుందని తెలిపారు.
Sports IG Dr. Gajarao Bhupal మాట్లాడుతూ జోగులాంబ, చార్మినార్, యాదాద్రి, బాసర, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి, కాళేశ్వరం జోన్లు, హైదరాబాద్, సైబరాబాద్, వరంగల్ కమిషనరేట్లు, Greyhounds, OCTOPUS, Intelligence, CID తదితర విభాగాలు పాల్గొంటున్నాయని తెలిపారు. అంతర్జాతీయ వేదికలపై రాణించిన P. Krishnarao, D. Sanjeev Kumar, Gopal Krishna, M.D. Baba, Avenu Gopal, S. Jayaram (Arjuna Awardee), K. Lavanyaలను సన్మానించారు.
పోలీస్ వెల్ఫేర్ అండ్ వెల్నెస్లో భాగంగా ఏర్పాటు చేసిన పోలీస్ ఎక్స్పోను DGP సతీమణి Hema Shivdhar Reddy ప్రారంభించారు. ఆరోగ్య సంరక్షణ, పోషకాహారం, క్రీడా పరికరాలు, ట్రాఫిక్ సాంకేతిక పరికరాలు, జైళ్ల శాఖ ఖైదీలు తయారుచేసిన హస్తకళా ఉత్పత్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ప్రదర్శన శనివారం వరకు కొనసాగనుంది.
ఈ కార్యక్రమంలో Soumya Mishra, Vikram Singh Mann, Mahesh Muralidhar Bhagwat, Dr. Anil Kumar, Vijay Kumar, V.B. Kamalasan Reddy, S. Chandrashekhar Reddy, Sumathi, Avula Ramesh Reddy తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.