Thank you for reading this post, don't forget to subscribe!
హైదరాబాద్, మార్చి 26:
గోవా నుంచి విమానాల ద్వారా అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న ఘటనను టాస్క్ ఫోర్స్ (STF) అధికారులు వెలికితీశారు. విశ్వసనీయ సమాచారం అందడంతో STF ‘A’ టీమ్ అధికారి అంజి రెడ్డి నేతృత్వంలో శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) సమీపంలోని పహాడీషరీఫ్ ప్రాంతంలో విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో మొత్తం 127 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం పరిమాణం 111.5 లీటర్లు కాగా, సుమారు రూ.2.5 లక్షల విలువ ఉంటుందని అంచనా వేశారు. ఈ ఘటనకు సంబంధించి రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు.
మొదటి కేసులో వరంగల్కు చెందిన మునిగంటి వినోద్ కుమార్ వద్ద నుంచి 32 సీసాలను స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో ఢిల్లీ–గోవా మార్గం ద్వారా అక్రమంగా తరలిస్తున్న 95 సీసాలను పట్టుకున్నారు. నిందితులు విమాన ప్రయాణాన్ని ఉపయోగించుకుని డ్యూటీ పేడ్ మద్యం హైదరాబాద్కు తీసుకువచ్చి, నగరంలో అధిక ధరలకు విక్రయించేందుకు ప్రయత్నించినట్లు అధికారులు వెల్లడించారు.
స్వాధీనం చేసిన మద్యం, అలాగే నిందితులను మీర్పేట్ ఎక్సైజ్ స్టేషన్కు అప్పగించారు. అక్రమ మద్యం రవాణా మరియు విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. నగరంలో ఇటువంటి కార్యకలాపాలను అరికట్టేందుకు తనిఖీలు మరింత పెంచనున్నట్లు తెలిపారు.
