Hydereabad: Yousufguda Police ground లో ఘనంగా నిర్వహించిన “ఉస్తాద్ భగత్ సింగ్” ప్రీ-రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్లు శ్రీలీల మరియు రాశీ ఖన్నా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అభిమానుల సందడి మధ్య ఈ ఇద్దరు హీరోయిన్లు స్టేజ్పై ఎంట్రీ ఇవ్వగానే ఆడియన్స్ హర్షధ్వానాలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం యూసుఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో భారీ స్థాయిలో జరిగింది.
Thank you for reading this post, don't forget to subscribe!
స్టైలిష్ డ్రెస్లో వచ్చిన రాశీ ఖన్నా తన గ్లామర్తో ఫ్యాన్స్ను ఆకట్టుకుంది. స్టేజ్పై ఆమె ఇచ్చిన పోజులు, అభిమానులతో చేసిన ఇంటరాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక శ్రీలీల కూడా తన ఎనర్జీతో ఈవెంట్కు ప్రత్యేక హైలైట్గా మారింది. ఆమె స్పీచ్లో పవన్ కళ్యాణ్తో పని చేసిన అనుభవం గురించి చెప్పడంతో అభిమానులు చప్పట్లతో స్పందించారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు భారీగా హాజరైన ఈ వేడుకలో ఇద్దరు హీరోయిన్ల అందాలు, స్టేజ్పై చేసిన సరదా కామెంట్లు ఈవెంట్కు మరింత గ్లామర్ తీసుకొచ్చాయి. మొత్తంగా చెప్పాలంటే, ప్రీ-రిలీజ్ వేడుకలో శ్రీలీల – రాశీ ఖన్నా హల్చల్ టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది.




