హైదరాబాద్: Cyberabad Police Commissionerate పరిధిలో రోడ్డు ప్రమాదాలను తగ్గించి, ప్రజల్లో బాధ్యతాయుతమైన డ్రైవింగ్ సంస్కృతిని పెంపొందించేందుకు ‘Arrive Alive’ రోడ్డు భద్రతా కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమం భాగంగా Satva Knowledge Parkలో నిర్వహించిన అవగాహన సదస్సులో Vigilance & Enforcement, TGCSB & FSL DG Shikha Goel ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా Shikha Goel మాట్లాడుతూ, రోడ్డు భద్రత అనేది కేవలం ట్రాఫిక్ నిబంధనలకే పరిమితం కాదని, ప్రతి పౌరుడి వ్యక్తిగత బాధ్యతగా భావించాలని స్పష్టం చేశారు. జరిమానాలకు భయపడి కాకుండా, తమ ప్రాణాలను కాపాడుకోవడానికి నిబంధనలు పాటించడం అత్యవసరమని పేర్కొన్నారు. సమాజంలో ఇతర నేరాల కంటే రోడ్డు ప్రమాదాల వల్లే అధిక సంఖ్యలో ప్రాణ నష్టం జరుగుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8,000 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారని తెలిపారు.
వాహనం నడిపేటప్పుడు సెల్ఫోన్ వినియోగం, అతివేగం వంటి చిన్న అజాగ్రత్తలు కూడా ప్రాణాంతకంగా మారుతున్నాయని ఆమె హెచ్చరించారు. ప్రస్తుతం Seat Belt వినియోగంలో ప్రజల్లో సానుకూల మార్పు కనిపిస్తోందని, అలాగే ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా Helmet ధరించాలని సూచించారు. పాదచారులు రోడ్డు దాటేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
Cyberabad Police Commissioner Dr. M. Ramesh మాట్లాడుతూ, ‘Arrive Alive’ కార్యక్రమం ద్వారా పాఠశాలలు, కళాశాలలు మరియు పబ్లిక్ ప్రదేశాల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. Overspeeding, Drunk Driving, Rash Driving, Signal Jumping మరియు Wrong Route Driving వంటి కారణాలే ప్రధాన ప్రమాదాలకు దారితీస్తున్నాయని వివరించారు. “Speed thrills, but it kills” అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని కోరారు.
ప్రత్యేకంగా 18 నుండి 35 సంవత్సరాల మధ్య యువతే ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యువత దేశానికి వెన్నెముకగా నిలవాలని, Defensive Driving పద్ధతులను అలవాటు చేసుకోవాలని సూచించారు. కేవలం తమ భద్రత మాత్రమే కాకుండా, ఇతరుల భద్రతను కూడా దృష్టిలో ఉంచుకొని వాహనం నడపాలని సూచించారు.
యువతలో మార్పు తీసుకురావడానికి కాలేజీల్లో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. Enforcement చర్యల్లో భాగంగా ‘Operation ROPE’ను కఠినంగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. Footpathsపై అక్రమ ఆక్రమణలను తొలగించి పాదచారులకు సురక్షిత మార్గాలను కల్పిస్తున్నామని చెప్పారు.
వాహనదారులు Lane Discipline పాటించాలని, రాత్రి వేళల్లో Lights వినియోగంపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొత్తగా Driving License పొందే వారికి ప్రత్యేక శిక్షణ అందించేందుకు స్వచ్ఛంద సంస్థలతో కలిసి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే Cyberabad రోడ్లను ప్రమాద రహితంగా మార్చగలమని అధికారులు స్పష్టం చేశారు.
Safety is in Our Hands: Cyberabad Police Drive ‘Arrive Alive’ Campaign
